నన్ను ఇండియాలో వెలివేస్తే.. హాలివుడ్ లో సినిమా తీస్తా : సందీప్ వంగా

praveen
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ దర్శకులలో ఒకడిగా కొనసాగుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు వరకు ఆయన తీసింది కేవలం రెండే రెండు సినిమాలు  అయినప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ఇక ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులను  చేసేస్తూ ఉన్నాడు  అయితే తన సినిమాలతో అదే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. గతంలో టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి అనే సినిమా తీసి సెన్సేషన్ సృష్టించాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

 బాలీవుడ్ ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేశాడు. ఇక ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టేసాడు. ఈ మూవీ ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిన విమర్శలు కూడా కాస్త ఎక్కువగానే వచ్చాయి. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డివంగా తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే సందీప్ సినిమాల పై విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలలో హీరోయిన్లను చూపించే విధానం పై విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.

 ఇలాంటి పరిస్థితుల మధ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ ఇండియాలో నన్ను వెలివేస్తే ఏకంగా హాలీవుడ్లో సినిమా తీస్తాను అంటూ కామెంట్ చేశాడు. నా సినిమాలని నన్ను ఎవరు ఆపలేరు. ఇక్కడ వ్యతిరేకిస్తే ఇతర భాషల్లో చేస్తా. మరాఠీ, భోజ్పూరి, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, హిందీలో కూడా సినిమాలు చేస్తాను. నాకు లాంగ్వేజ్ భారియర్స్ అంటూ ఏమీ లేవు. ఇండియాలో అడ్డుకుంటే హాలీవుడ్ లో కూడా సినిమా చేస్తా అంటూ సందీప్ రెడ్డి  చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: