దశాబ్ద కాలం తర్వాత.. మళ్ళీ పోటీ పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు స్టార్ హీరోలు ఇక తమ సినిమాలను విడుదల చేయడానికి ఒక మంచి తేదీని వెతుక్కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఇలా ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు  ఒకేసారి సినిమాలు విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఇక ఈ సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం,వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలు విడుదలయ్యాయి. ఇలా ఎంతోమంది హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే

 అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఆసక్తికరమైన పోటీ టాలీవుడ్ లో ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఏకంగా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇండస్ట్రీలో ఇలా స్టార్ హీరోల సినిమాలు పోటీ పడటం కామన్. ఇందులో కొత్తేముంది అంటారా. అయితే దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు  సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. కేవలం రోజుల వ్యవధిలోనే ఇద్దరు స్టార్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఏప్రిల్ ఐదవ తేదీన విడుదలవుతుంది అనుకున్న దేవరా సినిమా చివరికి వాయిదా పడింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద పవన్, తారక్ మధ్య పోటీ నెలకొనబోతుంది  కాగా దశాబ్దం కిందట వీరిద్దరి సినిమాలు ఇలాగే పోటీ పడ్డాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది, ఎన్టీఆర్  నటించిన రామయ్య వస్తావయ్య సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయ్. ఇక ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ అవ్వగా.. ఇక పవన్ కళ్యాణ్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: