అలా జరిగి ఉంటే.. ఎవరో ఒకరిని చంపేసేవాడిని : అమర్ దీప్

praveen
బుల్లితెర సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నటుడు అమర్ దీప్ చౌదరి. ఇక ఎన్నో సీరియల్స్ లో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బుల్లితెరపై  వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఏకంగా బిగ్ బాస్ అనే కార్యక్రమంలో ఛాన్సులు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన ఆట తీరుతో బుల్లితెర  ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ షోలో చివరి వరకు కొనసాగుతూ చివరికి రన్నరప్ గా నిలిచాడు.

 అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అమర్, ప్రశాంత్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. అమర్ ఎన్నోసార్లు పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అయితే ఇక ఇదంతా మనసులో పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ అభిమానులు గ్రాండ్ ఫినాలే రోజు అమర్ దీప్ ఫై కోపం తీర్చుకున్నారు అని చెప్పాలి  గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తర్వాత కారులో బయటికి వస్తున్న అమర్దీప్ కారుపై ఏకంగా రాళ్ల దాడి చేశారు. ఇక ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇదే విషయంపై ఏకంగా పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. కాగా ఈ ఘటన గురించి పలుమార్లు అమర్దీప్ కూడా స్పందించాడు.

 ఇకపోతే ఇటీవలే శోభా శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాపీ విత్ శోభ అనే కార్యక్రమాన్ని కి అమర్ తన భార్య తేజస్వినితో హాజరయ్యాడు. ఈ క్రమంలోనే ఆ రోజు బిగ్ బాస్ ఫినాలే  ఎపిసోడ్ ముగిసిన తర్వాత జరిగిన ఘటన గురించి మరోసారి మాట్లాడాడు. నేను అమ్మ తేజస్విని కారులో వస్తున్నప్పుడు.. ఒక్కసారిగా మాపై రాళ్లదడు జరిగింది. వాళ్ళందరూ అలా దాడి చేయడానికి కారణం నేను. కానీ ఆ రాళ్ల దాడిలో అమ్మ తేజు కూడా గాయపడతారేమో అని భయపడ్డాను. కారు దిగి బయటకు రావాలి అనుకున్నాను. అమ్మ ఆపింది. పొరపాటున ఆరోజు అమ్మకి కనక ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే నేను బయటికి వచ్చి ఎవరో ఒకరిని చంపేసేవాడిని అంటూ అమర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: