మగవాళ్ళందరికి సారీ చెప్పిన ప్రియమణి

Anilkumar
సీనియర్ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఓవైపు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమె మరోవైపు లీడ్ రోల్స్‌లో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే 2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం' మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఓటీటీ 'ఆహా'లో రిలీజైన ఈ సిరీస్ కి ఇప్పుడు సీక్వెల్ రాబోతోన్న విషయం తెలిసిందే  'భామ కలాపం 2' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ని అభిమన్యు డైరెక్ట్ చేశారు.  

ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రియమణి స్టేజ్ పై పాట పాడి అదరగొట్టారుపూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్, ప్రియమణి జంటగా నటించిన 'గోలిమార్' సినిమాలో 'మగాళ్లు వట్టి మాయగాళ్లే 'అనే సాంగ్ అప్పటికీ, ఇప్పటికీ ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రియమణిని చూసినప్పుడల్లా అందరికీ ఇదే పాట గుర్తొస్తుంది. అందుకే 'భామాకలాపం2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన ప్రియమణిని యాంకర్ పాట పాడమని రిక్వెస్ట్ చేయగా.. 

ప్రియమణి పాడే ముందు మగవాళ్ళందరికీ సారీ చెప్పి 'మగాళ్లు వట్టి మాయగాళ్లే' సాంగ్ ని ఫుల్ జోష్ తో పాడి అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పక్క వాళ్ళ విషయాల పట్ల ఆసక్తిని చూపే అనుపమ(ప్రియమణి) అనే మధ్యతరగతి గృహిణి ఓ మర్డర్ కేసులో ఎలా చిక్కుకుంది? ఆ నేరం నుంచి బయట పడేందుకు ఆమె చేసే ప్రయత్నాల నేపథ్యంలో భామాకలాపం మూవీ తెరకెక్కింది. ఇక దానికి సీక్వెల్ గా రాబోతున్న 'భామాకలాపం 2' కూడా క్రైమ్ కామెడీ పాయింట్ తోనే  రూపొందుతోంది. అయితే ఈసారి క్రైమ్, థ్రిల్లింగ్ ఎలివెంట్స్ డోస్ పెంచినట్లు గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: