యానిమల్ లో ఆ సీన్ చేశాక.. గట్టిగా ఏడ్చేశా : రష్మిక

praveen
చలో అనే సినిమాతో నాగశౌర్యతో జోడి కట్టి టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. అయితే ఆ తర్వాత గీత గోవిందం అనే బ్లాక్ బస్టర్ హీట్ తో దర్శకులు అందరి దృష్టిలో పడింది. అటు వెంటనే ఏకంగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ దక్కించుకొని ఏకంగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది అని చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఎక్కడ వెనక్కితిరిగి చూసుకోలేదు ఈ సొగసరీ. ఇక ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది అని చెప్పాలి. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో పాగా వేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.

 అయితే ఇటీవలే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాలో నటించింది రష్మిక మందన్న.. ఇక ఈ సినిమాలో కాస్త ఓవర్ డోస్ అందాల ఆరబోతు చేసింది అని చెప్పాలి. అయితే ఇక ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక రష్మిక మందన ఈ మూవీలోని ఒక సన్నివేశం గురించి ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 యానిమల్ సినిమాలో ఒక సన్నివేశంలో నటించిన తర్వాత తాను నిజంగానే ఏడ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ఈ మూవీలో రణబీర్ కపూర్ను రష్మిక మందన్న చెంప దెబ్బ కొట్టే సీన్ ఉంటుంది. ఇక ఈ సీన్ తర్వాత విపరీతంగా ఏడ్చేసానని గట్టిగా అరిచాను అంటూ హీరోయిన్ రష్మిక తెలుపుతుంది. ఆ సన్నివేశంలో ఎంతో ఎమోషన్ ఉంది. డైరెక్టర్ చెప్పిన సీక్వెన్స్ అంతా సింగిల్ టేక్ లోనే చేశాం. ఈ సీన్ తర్వాత ఎంతగానో ఏడ్చేసాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా జోయాతో రణబీర్ ఫిజికల్ గా కలిసిన తర్వాత రష్మికతో చెప్పినప్పుడు రష్మిక ఏడుస్తూ నటిస్తుంది. ఇక తన నటన ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: