విలన్ గా మారనున్న ప్రముఖ సింగర్..
రఘు కుంచే.. నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ప్లేబ్యాక్ సింగర్ గా , గీత రచయితగా, డబ్బింగ్ కళాకారుడిగా , యాంకర్ గా, చిత్ర నిర్మాతగా , సంగీత దర్శకుడిగా పేరు పొందారు. ఒక వ్యక్తి ఇన్ని రంగాలలో అసాధ్యమైన తన ప్రతిభను కనబరిచడం అంటే అతిశయోక్తి కాదు. రఘు కుంచే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని గదరాడ లో జన్మించారు. మొదట రఘు కొంచెం తన సినీ జీవితాన్ని 2000వ సంవత్సరంలో వచ్చిన బాచి చిత్రం ద్వారా తన గానాన్ని ప్రేక్షకులకు వినిపించాడు.
కమెడియన్ సప్తగిరి హీరోగా, త్రిభాషా ఇల్యూజన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఎయిట్ చిత్రంలో సరికొత్తగా విలన్ క్యారెక్టర్ లో కనిపించటానికి సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలుగా మంచి గుర్తింపు పొందిన రఘు కుంచె, ఈ సారి విలన్గా రాణిస్తాడో లేదో వేచి చూడాలి మరి.