మెగాస్టార్ చిరంజీవి, రాచ్చరణ్తేజ్ ఇద్దరి కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ చిత్రంలోని చరణ్ పాత్రకోసం దర్శకధీరుడు రాజమౌళి అంగీకారంతోనే జరగాల్సింది అని అన్నారట. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న చరణ్ ఓ నెల రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం అనేది, కష్టమనే చెప్పాలి. అందులోనూ ప్రస్తుతం ఉన్న కరోనా ప్రభావంతో అన్ని సినిమాలు చాలా ఆలస్యమయ్యే పరిస్థితి అయితే నెలకొనింది. ఎందుకంటే ఇది జస్ట్ క్యామియో రోల్ కాదు. దాదాపు అరగంట నిడివి గలిగిన కీలకమైన పాత్ర. అయితే సినిమాలో ఈ పాత్రకి ప్రాధాన్యత చాలా ఎక్కువట. అంతే కాక ఈ పాత్రలో చరణ్ చనిపోతాడని తెలిసింది. మరి అలాంటి పాత్రకి మహేష్ ఒప్పుకున్నా ఆయన ఫ్యాన్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్న కారణంతోనే ఆయన సైడ్ అయ్యారని తెలిసింది.
ఇక ఇదిలా ఉంటే...ఇప్పటికే అనేక అవాంతరాలతో నడుస్తున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ నుండి చరణ్ వేరే మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రాజమౌళి అనుమతి ఇవ్వకపోవచ్చు. ఒకసారి వాయిదాపడిన ఆర్.ఆర్.ఆర్ ని జనవరి 2021కి వాయిదా వేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో పాటు, ఎప్పుడు మళ్ళీ మొదలవుతుందో కూడా ఎవ్వరికి తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఐతే చరణ్ ఒక వేళ నటించ లేకపోతే ఆ స్థానంలో పవన్ చేయడం కరెక్ట్ అని చిరు అండ్ కొరటాల భావిస్తున్నారట. ఇది ఎటూ సోషల్ కాన్సెప్ట్ సినిమా కావడంతో పాటు అన్న చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో పవన్ కచ్చితంగా ఒప్పుకునే అవకావాలు చాలానే ఉన్నాయని భావిస్తున్నారు. అందులోను కాసేపు ఉండే పాత్రకి వేరేవాళ్ళు ఒప్పుకోవడం అనేది కాస్త కష్టమేనట. ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక తీరినట్టే. చిరు, పవన్ కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఎప్పటికి నుండో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అది ఇలా సాధ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి తెర మీద అన్నదమ్ములిద్దర్నీ చూస్తే ఫ్యాన్స్కి పండగే పండగ.
మరింత సమాచారం తెలుసుకోండి: