బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో మిషన్ మంగళ్ అనే అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా ను తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు హిందీ డైరెక్టర్ జగన్ శక్తి. అయితే ఈ డైరెక్టర్ ఇప్పుడు చావు బతుకుల మధ్య వున్నాడు. కుటుంభ సభ్యులతో ఆనందంగా వున్న సమయంలో జగన్ శక్తి వున్నట్లువుండి అనారోగ్యంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జగన్ శక్తి మెదుడు లో రక్తం గడ్డకట్టిందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త తో అతని కుటుంభ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
ఇక జగన్ శక్తి సినీ కెరీర్ విషయానికి వస్తే హాలీడే ,ఇంగ్లీష్ వింగ్లీష్ , డియర్ జిదంగీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శక్తి మిషన్ మంగళ్ తో డైరెక్టర్ గా మారి తొలి ప్రయత్నం లో నే విజయం సాధించాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. అక్షయ్ కుమార్ తోపాటు ఈ చిత్రంలో విద్యా బాలన్, నిత్యా మీనన్,సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో నటించగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ చిత్రం తరువాత జగన్ శక్తి తన రెండో సినిమా ను కూడా అక్షయ్ కుమార్ తోనే చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమం లో ఇంతలో ఇలా అయ్యింది. కాగా జగన్ శక్తి త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు వాఖ్యానించారు. మరి మనం కూడా జగన్ శక్తి కోలుకొని మళ్ళీ అక్షయ్ కుమార్ తో మరో సినిమా చేయాలని కోరుకుందాం..