బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో వారం వారం ఎలిమినేట్ అవుతున్న హౌజ్ సభ్యులు తర్వాత సోషల్ మీడియాలో చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి సంజన, కిరీటి, నూతన్ నాయుడు, శ్యామల, తేజస్వి,భానుశ్రీ, నందిని ఎలిమేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్ పద్దతిలో నూతన్ నాయుడు, శ్యామల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొన్నటి వారం బిగ్ బాస్ నుంచి నందిని ఎలిమనేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా నందిని పలు ఛానల్స్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనీష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే ఆ రోజు రాత్రి నేను జస్ట్ హగ్ ఇచ్చా అంతే కిస్ చేయలేదు. కావాలనే కొంతమంది నాపై నెగిటివ్ ట్రోలింగ్స్ చేశారంటున్నారు బిగ్ బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్ నందిని కౌశల్ ఆర్మీపై ఫైర్ అవుతున్నారు. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత నాపైన వచ్చిన ట్రోలింగ్స్ చూసి షాకయ్యా అని.. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ తనను విలన్ని చేస్తూ చేస్తున్న ట్రోలింగ్స్ బాధించాయన్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ఏర్పడటం.. కౌశల్కు అనుకూలంగా ఈ గ్రూప్ పనిచేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసింది.
నాపై వచ్చిన ట్రోలింగ్స్లో నన్ను బాగా బాధపెట్టింది తనీష్తో నాకు ఎఫైర్ ఉందంటూ ప్రచారం చేయడం. ఓ రాత్రి తనీష్కు నేను హగ్ ఇవ్వడంతో దాన్ని నెగిటివ్గా ప్రచారం చేశారు. ఆరోజు రాత్రి అయ్యిందని తెలుసు ఎంత టైం అనేది తెలియలేదు. తనకి క్యాజువల్గానే హగ్ ఇచ్చా. దాన్ని పెద్ద విషయంలో చేసి మా ఇద్దరికి ఎఫైర్ ఉందంటూ ప్రచారం చేశారు.గేమ్ షోలో భాగంగా చిన్న చిన్న గొడవలు ఉన్నా తరువాత సర్ధుకుపోయేవాళ్లం. నేను బిగ్ బాస్ హౌస్లో ఇంత వరకూ కొనసాగానేంటే నో డౌట్ అది కౌశల్ వల్లే.. దానికి చాలా థాంక్స్ చెప్పా. నాకు వచ్చిన కొన్ని ఇబ్బందుల్ల కన్ఫ్యూజ్ అయ్యా.
దీన్ని పెద్ద ఇష్యూగా చేసి కౌశల్ ఆర్మీ నన్ను బయటకు పంపారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి వచ్చిన యాంకర్ శ్యామల ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆమె కొంతమందితో గ్రూప్ ఏర్పాటు చేసుకుంది.కేవలం కొంత మందితో మాత్రమే ఆమె చనువుగా ఉండి మిగిలిన వాళ్లను దూరం పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ వల్లే అంటూ ప్రచారం చేయడం వల్ల కౌశల్ ని విలన్ చేస్తున్నారని ‘కౌశల్ ఆర్మి’ మండిపడుతున్నారు.