నిశ్శబ్ధంగా సినీ రంగంలో ప్రవేసించి విస్పోఠనం సృష్టిస్తున్న 'తొలిప్రేమ' కథానాయకి



చక్కని సినిమా ప్రేమ సెంటిమెంట్ లేదా భావోద్బేగం సస్పెన్స్ ప్రస్థుతానికి దగరగా ఉన్న "ఊహలు గుసగుసలాడే" సినిమాతో నిశ్శబ్ధంగా తెలుగుచిత్రసీమ లోకి మందాకిని లా వచ్చి చేరిన రాశి ఖన్నా క్రమంగా అలకనందై ఆపై గంగోత్రిగా తన వేగం పెంచింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ బొద్దు గుమ్మ మాత్రం చక్కని ప్రేమ కథా చిత్రాలకు బాగా సరి పోయే ముగ్ధ మందార మోహనమౌవుతోంది.


ఆమె చక్కని నటనకు ఉదాహరణ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం  వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తున్న "తొలిప్రేమ".  ఈ సినిమా లో నటనపరంగా కథానాయకుని మించి మంచి మార్కులు కొట్టేసింది. నటనకు తన అందం తోడిచ్చి ఓస్థాయిలో ప్రేమ తో శృంగారం మేళవించి  యువహృదయాలను కేరింతలు కొట్టించింది. మరులు పొంగించింది. ఓ లిప్-లాక్ తో ప్రేక్షకుని మది లో తన్మయం ప్రవహించే అనుభూతిని ఇచ్చి నిశ్శబ్ధ విస్పోటనం కలిగించింది.


ప్రస్తుతం టాలీవుడ్ లో సన్నబడ్డ ముగ్ధగుమ్మకి ఆఫర్స్ వరద వెల్లువైందంట. కానీ రాశి ఖన్నా మాత్రం గతంలో లాగా కాకుండా కేవలం కథలో తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే అంగీకరిస్తుందని తెలుస్తుంది.  ఈ మధ్య రెండు మూడు కథలు విన్న రాశి,  నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాకు కథ నచ్చి అంగీకరించిందని టాలీవుడ్ టాక్. శతమానం భవతి సినిమాకు దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న దిల్ రాజు ప్రొడక్షన్ లో దర్శకత్వం వహించబోయే ఈ  కుటుంబ కథాచిత్రంలో రాశి ఖన్నాని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. 



"చలో" ఫేం రష్మిక మందాన ను ఇంతకు ముందు హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు, ఆపై ఆమె నే కథానాయకిగా నిర్ణయించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. కానీ ఆ తరవాత దర్శక నిర్మాతలు పునరాలోచించి ఈ కథకు రాశి ఖన్నా సరిగా సరి పోతుందని భావించినట్లు తెలుస్తుంది. నిజానిజాలు ఇంకా తెలియవలసి ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. మరి ఎవరు నటిస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: