ప్రభాస్ అండర్ గ్రౌండ్.. ఎందుకంటే?
అయితే ఈ విధంగా తన సినిమా పోస్ట్పోన్ కావడం పట్ల ప్రభాస్ చాలా నిరాశకు లోనయ్యారట. అందుకే కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. తన సినిమాలకు సంబంధించిన ఏ సినిమా విషయం లో ఇప్పుడు వేలు కూడా పెట్టడం లేదట ప్రభాస్. అంతేకాదు సంక్రాంతి సందర్భంగా కూడా ఏ ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా ఆయన పాల్గొన లేదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ చిత్రం పోస్ట్ పోన్ చేయడం పట్ల ఆయన ఎంత నిరాశకు లోనయ్యారు అర్థమవుతుంది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇలా అయిపోవడం నిజంగా ఎవరికి మాత్రం నచ్చుతుంది చెప్పండి.
ఇక ప్రభాస్ చేస్తున్న తదుపరి సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను దాదాపు పూర్తి చేసే స్థాయికి తీసుకువచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేస్తున్న ఆది పురుష్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ ను తొందరలోనే మొదలు పెట్టనున్నారు ప్రభాస్. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని సినిమా కూడా సెట్స్పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఓ బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం లో కూడా ప్రభాస్ సినిమా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్ దేశంలోని ఏ హీరోకి సాధ్యం కాని విధంగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అయితే ఇప్పుడు రాధే శ్యామ్ విడుదల ఆగిపోవడం ఈ సినిమాల పట్ల ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.