నిరుద్యోగులకు శుభవార్త ప్రభుత్వ కంపెనీలో ఖాళీలు... ?
* ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే అన్ని పోస్టులు కూడా స్కేల్ 1 పోస్టులే కావడం విశేషం. అన్ని పోస్టులు కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లు మాత్రమే.
* ఇందుకు అర్హతను పొందాలంటే సదరు అభ్యర్థి డిగ్రీ/పీజీ లో 60 శాతం మార్కులను కలిగి ఉండాలి.
* ఒకవేళ మీలో ఎవరైనా డిగ్రీలో చివరి సెమిస్టర్ చదువుతున్నా దీనికి అప్లికేషన్ వేసుకోవడానికి అర్హులవుతారు.
* అంతే కాకుండా మీ వయసు 01.04.2021 వ తేదీ రోజుకి 21 పైన నుంచి 30 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.
* ఆసక్తి కలవారు ఆన్లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
* ఈ పోస్టుకు ఎంపిక కావాలంటే మొత్తం మూడు స్టేజ్ లను దాటవలసి ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్షలో నెగ్గిన వారికి చివరగా ఇంటర్వ్యూ నిర్వహించి సంబంధిత పోస్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది.
* ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి నెలకు రూ. 32,795 నుండి రూ. 62,315 వరకు జీతంగా చెల్లించడం జరుగుతుంది.
* ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి సమయం 01.09.2021 నుండి 21.09.2021 వరకు ఉంది.
మరి కొన్ని వివరాలకు అఫిషియల్ సైట్ ను చూడవలెను.