నేరస్తుల పెళ్ళి.. పోలీసుల బందోబస్తూ.. ఎక్కడంటే?

praveen
సాధారణంగా పోలీసులు ఏం చేస్తారు అని ఎవరినైనా అడిగితే.. ఇంకేం చేస్తారు సభ్య సమాజంలో ఉన్న మనుషులందరూ ప్రశాంతంగా పడుకుంటున్నారు అంటే దానికి పోలీసులే కారణం  ఎందుకంటే నేరాలు జరగకుం డానిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఎవరైనా నేరానికి పాల్పడితే ఇక వారికి శిక్ష విధించడం లాంటివి చేస్తూ ఉంటారు. మర్డర్లు కిడ్నాప్లకు పాల్పడుతూ పోలీసులు కలుగప్పీ తప్పించుకుని తిరుగుతున్న గరుడ గట్టిన  నేరస్తులను పట్టుకోవడమే లక్ష్యంగా నిర్విరామంగా డ్యూటీ చేస్తూ ఉంటారు పోలీసులు అని చెబుతూ ఉంటారు.

 నిజమే ఇలా ఇప్పుడు వరకు పోలీసులు ఎన్నో సాహసాలు చేసీ కరుడ గట్టిన నేరస్తులను పట్టుకోవడం చూసాము. ఇక ఇలా పట్టుకుని నేరస్థులకు కోర్టులో హాజరు పరిచి సరైన శిక్ష పడేలా పోలీసులు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏకంగా ఇద్దరు నేరస్తులకు పోలీసులే పహార కాస్తూ ఉండడం గమనార్హం. ఇద్దరు నేరస్తులు పెళ్లి చేసుకుంటే ఇక వారికి ఏకంగా పోలీసులు భారీ ఎత్తున పహార కాయడానికి సిద్ధమైపోయారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఢిల్లీలోని ఇద్దరు గ్యాంగ్ స్టర్స్  పెళ్లి వేడుక సమయంలో ఇదే జరగబోతుంది. ఢిల్లీలోని ఒక హోటల్లో గ్యాంగ్ స్టర్స్ అయినా అనురాధ, సందీప్ పెళ్లి చేసుకోబోతున్నారు.

 ఈ ఇద్దరు మర్డర్లు, కిడ్నాప్లు, మని లాటరీ ఇలా ఒక్కటేమిటి అని నేరాల్లో కూడా నిందితులుగా ఉన్నారు. ఇక సందీప్ ప్రస్తుతం ఇక జైలు శిక్ష అనుభవిస్తుండగా అనురాధ బెయిల్ పైన బయట ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే ఒక హోటల్లో వీరిద్దరి వివాహ వేడుక జరగబోతుంది. అయితే ఈ వివాహ వేడుకకు 250 మంది పోలీసులు స్క్వాడ్ కమాండోలు, నేర దర్యాప్తుబృందాలు పహార కాయనున్నాయి. అతిధులకు బార్కోడ్ బ్యాండ్, ఎంట్రీ పాస్ తప్పనిసరిట. అయితే ఇదంతా వారికి సెక్యూరిటీ కోసం కాదు  అక్కడ గ్యాంగ్ వార్ జరగకుండా ఉండేందుకు పెరోల్ పై బయటికి వచ్చిన సందీప్ తప్పించుకోకుండా ఉండేందుకే ఇక ఇంతటి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారట పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: