ఇదెక్కడి విడ్డూరం.. ఆడపిల్ల పుట్టలేదని ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా??

praveen
ఆడబిడ్డ పుడితే భారంగా భావించేవారు తల్లిదండ్రులు. ఒకవేళ ఆడబిడ్డ పుట్టిన మగసంతానం కోసం ఎన్నో రోజులపాటు ఎదురుచూసేవారు అని చెప్పాలి. అయితే ఇక వరుసగా ఆడపిల్లలు పుడితే ఏకంగా కన్న పేగు బంధాన్ని కూడా మరచి పురుట్లోనే పసికందుల ప్రాణాలు తీసిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం పరిస్థితులు మారిపోయాయి.

 ఆడపిల్ల పుడితే భారం అనుకునే రోజుల నుంచి ఆడపిల్ల కావాలని పూజలు పునస్కారాలు చేసే రోజులు వచ్చాయి. అయితే ఇక మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన అయితే ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. ఏకంగా ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నారు తల్లిదండ్రులు. కానీ పుట్టలేదు దీంతో ఏకంగా కన్నకొడుకునే దారుణంగా చంపేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని బజార్ వాడ్ అనే గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అనిల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఓ గుడిసెలో నివాసం ఉంటున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది.

 కాగా ఇప్పటికే అనిల్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడో కాన్పులో ఆడబిడ్డ పుడితే బాగుండు అని కోరుకున్నాడు అనిల్. అయితే మూడో కాన్పులో కూడా మగ బిడ్డకే జన్మనిచ్చింది భార్య. ఈ విషయం అనిల్ కు అస్సలు నచ్చలేదు   మూడోసారి కూడా మగ బిడ్డ పుట్టడంతో అసంతృప్తి చెందాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో మద్యం మత్తులో అనిల్ విచక్షణ కోల్పోయాడు. భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది మహిళా. అయితే కాసేపటికి మళ్ళీ తిరిగి రాగా 12 నెలల పసికందు విగతజీవిగా పడి ఉండడం చూసి అరణ్య రోదనగా విలపించింది.  ఇక దీంతో పోలీసులకు ఫిర్యాదుగా చేయగా.. పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే గొంతు నులిమి చంపేసినట్లు నేరం అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: