కేసీఆర్పై దుమ్మెత్తిపోయడం ఆయిపోయింది.. మేడిగడ్డ పనులు ప్రారంభించిన సర్కారు?
మరోవైపు కుంగిన పియర్స్ కు చేపట్టాల్సిన రక్షణ చర్యలు కూడా చేపట్టనున్నారు. పియర్స్ కు మరిన్ని పగుళ్లు రాకుండా, తదుపరి దెబ్బతినకుండా అవసరమైన చర్యలపై ఆలోచిస్తున్నారు. ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన కమిటీ దీనిపై చర్చించింది. తక్షణ చర్యలు, వర్షాకాలం లోపు పూర్తి చేయాల్సిన పనులు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల గురించి చర్చించారు. ప్రాణహిత నీటి మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తారు.