ఆ రెండు స్థానాలను ప్రెస్టీజ్‌గా తీసుకున్న రేవంత్‌రెడ్డి?

Chakravarthi Kalyan
సొంత జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్టీజ్‌ గా తీసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి పార్లమెంటు స్థానాలు గెలిపించాలని.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలు గెలిపించాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు.

దాదాపు  రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై నేతలతో రేవంత్ రెడ్డి చర్చించారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. పోలింగ్ బూత్ ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: