బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్
ఈ సందర్భంగా దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపుమేరకు ప్రదాని నరేంద్ర మోడీ జనరంజక పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా బీజేపీలో చేరాలని ఆయన కోరారు. మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ఒక సైనికుడిలా పనిచేస్తానని ఆయన చెప్పారు.