జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని కన్మోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారని, దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని..ఈ సందర్భంగా అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు.