ప్రభుత్వానికి చిన బాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ లో తక్షణమే పది పరిక్షలు రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. “కరోనా సామాజికవ్యాప్తి మొదలైన ప్రమాదకరమైన దశలో లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా టెన్త్ పరీక్షలు రద్దుచేయాలి.
తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తమ విద్యార్థులను కాపాడుకునేందుకు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా వ్యవహరించడం తగదు.కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి నేటి వరకూ వైఎస్ జగన్ గారు మాత్రం తాడేపల్లి గడప కూడా దాటి రావడంలేదు. లక్షలాది మంది విద్యార్థులను మాత్రం పరీక్షల పేరుతో కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారు తక్షణమే పరీక్షల రద్దు ప్రకటించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతాం” అని హెచ్చరించారు.
కరోనా సామాజికవ్యాప్తి మొదలైన ప్రమాదకరమైన దశలో లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా టెన్త్ పరీక్షలు రద్దుచేయాలి. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తమ విద్యార్థులను కాపాడుకునేందుకు పరీక్షలు రద్దు చేశాయి(1/3)#Cancel10thExamsInAP pic.twitter.com/azKs00AUrA — lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 20, 2020
ఏపీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహిస్తామనే విధంగా వ్యవహరించడం తగదు. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి నేటి వరకూ జగన్ గారు మాత్రం తాడేపల్లి గడప కూడా దాటి రావడంలేదు. లక్షలాది మంది విద్యార్థులను మాత్రం పరీక్షల పేరుతో కరోనా కోరల్లోకి నెట్టేస్తున్నారు.(2/3) — lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 20, 2020
తక్షణమే పరీక్షల రద్దు ప్రకటించకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతాం.(3/3)#Cancel10thExamsInAP#SaveOurStudents — lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 20, 2020