పవన్-క్రిష్ సినిమా కథ నేపథ్యం అదేనా..?
గత కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇటీవల ఆయన నటిస్తున్న వకీల్సాబ్ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మేలో చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. దీంతోపాటు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్. ఇది ఒక పీరియాడికల్ డ్రామా అని టాక్. తాజాగా దీనికి సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. అదీ మెగాబ్రదర్ నాగబాబు నోటి నుంచి రావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.
పవన్ కల్యాణ్- క్రిష్ సినిమాకు సంబంధించి ఆయన ఓ విషయాన్ని పంచుకున్నారు. నాకు తెలిసి పవన్-క్రిష్ సినిమా మొగలాయిల కాలం నాటి కథతో తెరకెక్కుతుంది. అదే సమమంలో ఆంధ్రప్రదేశ్, వారియర్ కథ అంటున్నారని, కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. నాకు టైటిల్ తెలియదు, నేను కూడా దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.