ఏపీ: రోజురోజుకి ఇంత దారుణమా... ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం..!

Divya
రోజురోజుకి ఆంధ్రప్రదేశ్లోని అత్యాచారాల సంఘటనలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.. గడచిన నాలుగైదు రోజుల క్రితం మూడేళ్ల చిన్నారిని ఏడేళ్ల విద్యార్థులు అత్యాచారం చేసి ఆ చిన్నారిని చంపేయడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఆ చిన్నారికి సంబంధించి ఎలాంటి ఆచూకీ కూడా తెలియడం లేదు.. దీంతో పోలీసులు విపరీతంగా గాలిస్తున్న సమయంలో ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే రామభద్రపురం విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. ఏకంగా ఆరు నెలల చిన్నారి పైన తాత వరుస అయ్యే వ్యక్తి అత్యాచారం చేయడంతో ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బొబ్బిలి డిఎస్పి తెలిపిన సమాచారం మేరకు.. ఊయలలో పడుకున్న చిన్నారిపై ఈ అగాయిత్యం జరిగినట్లుగా తెలియజేశారు..తన  కూతురినీ ఉయ్యాలలో వేసి గ్రామంలో కిరాణా దుకాణానికి వెళ్లిందట ఆ తల్లి.. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారి పైన అత్యాచారం చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఆ చిన్నారి గట్టిగా అరవడంతో ఏడుపు విన్న.. చిన్నారి అక్క ( పెద్ద కూతురు) అక్కడికి చేరుకొని వెంటనే ఈ విషయాన్ని తన తల్లికి చేర వేసిందట.

ఈ విషయం విన్న గ్రామస్తులు సైతం నిందితుని పట్టుకోవడానికి వెంబడించగా ఆ వ్యక్తి పరారైనట్లుగా పోలీసులు తెలియజేశారు. అనంతరం చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే నార్ల వలస గ్రామానికి వెళ్లి పోలీసులు సైతం విచారణ చేపడతామంటూ తెలియజేశారు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఆ వ్యక్తి పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నామంటూ తెలియజేశారు. మరి పోలీసులు 24 గంటలలోని నిందితుని అరెస్టు చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: