టీవీ: పల్లవి ప్రశాంత్ తో పెళ్లిపై నిజాన్ని చెప్పేసిన బర్రెలక్క..!!

Divya
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ఈ మధ్య మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో ఏది నిజమో అబద్దమో తెలుసుకోవడానికి చాలామంది నెటిజెన్స్ అయోమయంలో పడుతున్నారు.. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ అయిన కామన్ మాన్ పల్లవి ప్రశాంత్.. తెలంగాణలో యూట్యూబ్లో పెను సంచలనంగా మారిన బర్రెలక్క ఇద్దరు కూడా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ విషయం పైన బర్రె లెక్క కాస్త ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది.వాటి గురించి చూద్దాం.

ముఖ్యంగా వీరిద్దరూ రైతు కుటుంబానికి చెందినవారు కావడం కాబట్టే ఇలా ప్రచారం జరిగిందని పెళ్లి అయినట్టు కొన్ని మార్పింగ్ ఫోటోలు కూడా క్రియేట్ చేశారని ఇవన్నీ బర్రె లెక్క దగ్గరకు వెళ్ళగా ఆమె స్పందిస్తూ ప్రశాంత్ అన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో తన సపోర్టు కూడా ఉంటుందని.. అన్న అన్ని క్లియర్ గా పిలిచినప్పటికీ అలాంటి అన్నతో తనకు వివాహం ఎలా అంటూ ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేయడం కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి పనులకు దిగజారి పోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

తమ జీవితాలతో ఎవరూ ఆడుకోవద్దు అండి అంటూ వార్నింగ్ ఇస్తోంది బర్రె లెక్క పల్లవి ప్రశాంతును తాను మొదటి నుంచి అన్న అనే పిలుస్తూ ఉన్నానని అన్నని ఎవరైనా వివాహం చేసుకుంటారా ఇదెక్కడి సాంప్రదాయం అంటూ ఆమె ఘాటుగానే ప్రశ్నించింది.. బర్రె లెక్క అసలు పేరు (శిరీష) కాగ ఈమె నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఇంస్టాగ్రాఫ్ యూట్యూబ్ లలో పెట్టిన వీడియోల వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బాగానే పాపులారిటీ అందుకుంది. మొత్తానికి స్టేట్ మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది బర్రెలక్క అలియాస్ శిరీష. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: