టీవీ: దహనం చేయడానికి డబ్బులు కూడా లేని ఆర్టిస్ట్..!

Divya
సినిమా అంటే కేవలం.. రెండు గంటలే అని అంటూ ఉంటారు. కానీ సినిమా అలా రావడం కోసం, ప్రేక్షకులను మెప్పించడం కోసం.. ఎంతోమంది నటీనటులు కష్టపడితే గానీ సినిమా అంతలా పండదు. ఇక వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు కచ్చితంగా పెట్టుకుంటారు. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు.. ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ.. ఎంతో మంది వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ హైదరాబాదులో ఉంటోంది. కొన్ని సినిమాలలో నటించేందుకు అవకాశాలు దక్కించుకొని.. కుటుంబానికి సహాయం చేస్తూ ఉండేది.
కానీ అలాంటి సమయంలోనే ఆమె ప్రయాణిస్తున్నప్పుడు మరణించింది. కానీ ఆమె దహన సంస్కారములు చేయడానికి కూడా డబ్బులేని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులు ఉండడంతో ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటన. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జడ్చర్ల ఏరియాలో ఉంటున్న మానస అని 20 సంవత్సరలా యువతి.. తన కుటుంబంతో కలిసి ఉండేది. యువతికి చిన్నప్పట్నుంచి బాగా నటన మీద మక్కువ ఉండేదట. తన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. అలరించాలని చాలా ఆతృతగా ఉండేదట ఆమె. కానీ ఇమే కుటుంబ పరిస్థితులు దీన స్థితిలో ఉండడం వల్ల ఈమె కల సౌకర్యం కాలేదు.
కానీ మానస చిన్న వయసులోనే తల్లి కూడా మరణించింది. పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తూ వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది వారు. కానీ కొన్ని సార్లు ఎక్కువగా ఖర్చు అవడంతో.. తినడానికి తిండి లేని  పరిస్థితుల్లో ఉండి అలాగే నిద్రించే వారట. కానీ ఈమె జూనియర్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చినప్పుడు నుంచి హైదరాబాదు లోనే ఉండేదట. ఈమే ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ లో యాక్సిడెంట్ కు గురైనట్లు తెలుస్తోంది. ఇక ఈమెకు తెలంగాణ సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేవు అని తన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారట. ప్రస్తుతం ఇది బాగా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: