టీవీ: టాప్ సీరియల్ లో నటించిన.. ఈ నటి గుర్తుందా !

Divya
ఒకప్పుడు జెమిని ఛానల్ లో ప్రసారమయ్యే నాటికలు టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఛానల్ కొంచెం వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ప్రసారమైన ఒక సీరియల్ గురించి అందులో నటించిన ఒక నటి గురించి, ఆమె ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో..? తెలుసుకుందాం.

బుల్లితెరపై జెమినీ టీవీలో ప్రసారమయ్యే "చక్రవాకం" సీరియల్ కు ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారో మనకి తెలిసిన విషయమే. ఇందులో నటించిన నటులను ప్రేక్షకులు ఎంతగానో అభినందించారు. అలా అభినందించిన వారీ లో "ప్రీతి ఆమిన్, లిఖిత లు ఇద్దరూ తమ నటనతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కొన్ని సీరియల్స్ లో నటించి,వీరు  బుల్లితెరకు గుడ్ బై చెప్పేశారు.
ఇక ఇదే సీరియల్స్ లో  నటించిన సాగర్, ఇంద్ర నీల్ లు  ప్రస్తుతం బుల్లితెర పైన, వెండి తెర పైన కూడా రాణిస్తున్నారు. ఇందులోనే మరొక నటి"పావని"కూడా తన అందంతో, తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె ఈ సీరియల్ తో పాటు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. ఈమె తల్లిదండ్రులు కూడా దూరదర్శన్ లో ప్రసారమయ్యే కొన్ని నాటికలకు డైరెక్టర్ గా పని చేశారు.
పావని కి ఒక సోదరి కూడా ఉంది.ఈమె పేరు శ్రావణి.ఈమె ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో "శాంతి నివాసం" అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. శ్రావణి  ఎన్ టి ఆర్ "సింహాద్రి " సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమె కూడా నటనకు గుడ్బై చెప్పేసింది. ఇక పావని కూడా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ కావడంతో, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంది. అయితే అప్పట్లో ప్రేక్షకులను అలరించిన వీరంతా, సినీ ఇండస్ట్రీకి , బుల్లితెరకు దూరం కావడం వారి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: