వరల్డ్ కప్ విజేత ఇంట.. తీవ్ర విషాదం?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఎంత విపరీతమైన క్రేజీ ఉంది అన్న విషయం గురించి కొత్తగా చెబితే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్నింటికీ కూడా ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి తెలుసు. పాశ్చాత్య ఆట అయినప్పటికీ అటు క్రికెట్ కి భారత క్రీడాభిమానులు అందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ క్రమం లోనే మిగతా క్రీడలు అన్నింటినీ కూడా వదిలేసి క్రికెట్ నే అమితంగా ఆదరిస్తూ, అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు అన్ని పనులను పక్కన పెట్టేసి ఇక టీవీలకు అతుక్కు పోతూ ఉంటారు. అయితే ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతుంది. అయితే ఇటీవలే ఒక క్రికెటర్ కు సంబంధించిన విషాదకర వార్త గురించి తెలిసి.. విచారం వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఏకంగా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్న ఆటగాడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

 టీమిండియా మాజీ ప్లేయర్ కీర్తి ఆజాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పూనమ్ అనారోగ్యం కారణం గా ఇటీవలే కన్ను మూశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆజాద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పూనమ్ చాలా కాలం గా అనారోగ్యం తో బాధ పడుతున్నారని.. ఇక ఇటీవలే తుది శ్వాస విడిచినట్లు చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఆజాద్ టి ఎం సి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. కాగా పూనం మృతి పై ఇక ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియ జేశారు. కాగా అజాద్ 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీం లో సభ్యుడు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: