మయాంక్ పెర్ఫార్మెన్స్ పై మండిపడుతున్న SRH అభిమానులు..!

Pulgam Srinivas
ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీం లో ఎన్నో అద్భుతమైన పర్ఫామెన్స్ లను ఇచ్చిన మయాంక్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇండియన్ క్రికెట్ టీం లో మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐపీఎల్" లో కూడా ఎన్నో అద్భుతమైన పర్ఫామెన్స్ లను ఆడాడు. ప్రస్తుతం ఈయన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్రైజర్స్ టీం లో ఆడుతున్నాడు.  

ఇప్పటి వరకు సన్ రైజర్స్ టీం మూడు మ్యాచ్ లను ఆడింది. అందులో ఒక మ్యాచ్ లో గెలుపొందగా మరో రెండింటిని సన్ రైజర్స్ ఓడిపోయింది. ఇకపోతే సన్ రైజర్స్ టీం ఓటమిల విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ టీం.లో ఆడుతున్నటువంటి మయాంక్ అగర్వాల్ పర్ఫామెన్స్ మై మాత్రం సున్ రైజర్స్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే ... మొదటగా సన్రైజర్స్ టీం కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ను ఆడింది.

ఇందులో 21 బంతులు ఆడిన మయాంక్ 32 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ టీం ముంబై ఇండియాన్స్ టీం పై హై స్కోర్ ను సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా మయంకా 13 బంతులు ఆడి కేవలం 11  పరుగులు మాత్రమే చేశాడు. ఇక నిన్న సన్ రైజర్స్ కి జీటి మధ్య మ్యాచ్ జరిగింది.

ఇందులో మయంక్ 17 బంతులు ఆడి 16 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోయింది. దీనితో చాలా మంది మాయంక్ ఈ సీజన్ లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపొతున్నాడు. అయినా ప్లేస్ లో వెరేవల్లని తీసుకుంటే బాగుంటుందని చాలా మంది సన్ రైజర్స్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: