టెస్ట్ మ్యాచ్ కి మంచు ముప్పు.. ఏం జరుగుతుందో?

praveen
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ ఆడేందుకు  ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది  ఇక ఈ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతుంది  అయితే ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన ఇండియా ఆ తర్వాత జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్లలో మాత్రం విజయం సాధించింది. ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్లలో గెలుపొందడంతో 3-1 తేడాతో ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది.

 సొంత గడ్డపై వరుసగా ఏకంగా 17 టెస్ట్ సిరీస్లను గెలుచుకున్న జట్టుగా ఇక ఒక ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది అని చెప్పాలి  అయితే ఇక ఇప్పుడూ ధర్మశాల వేదికగా జరగబోయే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండు జట్టు కనీసం ఐదవ టెస్ట్ మ్యాచ్లో అయిన విజయం సాధించాలి అనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఐదో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం అనేది తెలుస్తుంది. ఇలాంటి సమయంలో అసలు మ్యాచ్ నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఎందుకంటే ఈనెల 7వ తేదీ నుంచి జరగబోయే ఇండియా, ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ కి మంచుముప్పు ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే వేదిక అయిన ధర్మశాలలో ఏకంగా మ్యాచ్ జరిగే రోజు 1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లకు చలి ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి  అలాగే స్టేడియం పై మంచు కురిసే అవకాశాలు ఉండడంతో.. ఇక ఆట సజావుగా జరుగుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. అయితే ఇక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం నాటికి వాతావరణ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తే ఇక మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: