కెప్టెన్ రోహిత్ రికార్డుకి.. ఎసరు పెట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగుతుంది. అయితే ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయ్. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే మిగిలిన రెండు మ్యాచ్లలో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

 అయితే మొదట్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం కాస్త తడబాటుకు గురై చివరికి వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ జో రూట్.. క్రీజ్ లోకి వచ్చి ఇక జట్టు ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఇక సెంచరీ తో చెలరేగిపోయాడు ఈ ఆటగాడు. ఈ క్రమంలోనే 16పరుగులు చేసిన ఈ స్టార్ ప్లేయర్ ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు అని చెప్పాలి. టీమిండియా పై టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వరకు భారత జట్టుపై ఏకంగా 10 టెస్ట్ సెంచరీలు చేశాడు జో రూట్.

 ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు ఈ ఆటగాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా జోరు నిలిచాడు. ఏకంగా ఇప్పటివరకు అతని కెరియర్లో 47 సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ కూడా 47 సెంచరీలతోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇక అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో డేవిడ్ వార్నర్49 సెంచరీలతో ఉండగా.. ఇక రోహిత్ జోరూట్ తర్వాత స్థానాలలో కేన్ విలియమ్సన్ 45, స్టీవ్ స్మిత్  44 సెంచరీలతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: