కోహ్లీ సేఫ్ గానే ఉన్నాడని అనుకుంటున్నా.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఇక జట్టు విజయాల్లో ఎంత కీలకపాత్ర వహిస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు ఫార్మాట్లలో కూడా తన ప్రదర్శనతో అటు ప్రత్యర్థులను పనికిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక కోహ్లీ జట్టులో ఉన్నాడు అంటే టీమిండియా కు తప్పకుండా విజయం వరిస్తుంది అని భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ అలాంటి విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు జట్టుకు అందుబాటులో లేడు. దీంతో ఇక టీంలో విరాట్ కోహ్లీ లేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక భారత జట్టు బాగా రాణిస్తున్న ఎందుకో కోహ్లీ లేని భారత జట్టు ఆట తీరును మాత్రం ఆస్వాదించలేకపోతున్నారు భారత క్రికెట్ అభిమానులు.

 ప్రస్తుతం టీమిండియా జట్టు అటు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికీ రెండు టెస్టులు ముగిసాయి. రెండు టెస్టులకు కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇక టెస్ట్ సిరీస్ మొత్తానికి కూడా అతను దూరమయ్యాడు అనే విషయాన్ని బీసీసీఐ సెలెక్టరు స్పష్టం చేశాడు. అయితే అతను దూరం కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కానీ కోహ్లీ లేకుండా భారత జట్టును చూడలేకపోతున్నాం అని అభిమానులు అందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర ఎక్కువ కూడా స్పందించాడు.

 వ్యక్తిగత కారణాలతో క్రికెట్ జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీని ప్రస్తుతం యావత్ దేశం మొత్తం మిస్ అవుతోంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. కోహ్లీ ఎక్కడున్నా, అతడు అతని కుటుంబం సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్న.. త్వరలోనే తను క్రికెట్ లోకి తిరిగి వస్తాడని అనుకుంటున్నాను. అతను ఒక అత్యుత్తమ క్రికెటర్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. నిజమే విరాట్ కోహ్లీ లేని జట్టును ఊహించుకోలేకపోతున్నాం. అతని ఆటను చూడటానికి ఇన్నాళ్లపాటు టీం ఇండియా ఆడే మ్యాచ్లను చూసే వాళ్ళం. కానీ ఇప్పుడు అతన్ని బాగా మిస్ అవుతున్నాం అంటూ ఇక అటు వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పోస్ట్ పై ఎంతో మంది నేటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: