సిద్ధూ జోనల్లగడ్డ మాస్టర్ ప్లాన్ !

Seetha Sailaja
‘టిల్లు స్క్వేర్’ మూవీతో యూత్ కు విపరీతంగా కనెక్ట్ అయిన సిద్దూ జొన్నలగడ్డకు అనేకమంది దర్శక నిర్మాతల దగ్గర నుండి ఆఫర్స్ వస్తున్నప్పటికీ వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోకుండా కథ విషయంలో ఎటువంటి రాజీలేదు అంటూ తన వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలకు సిద్దూ స్పష్టంగా చెప్పుతున్నట్లు టాక్. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘జాక్’ మూవీని ఈ సంవత్సరంలోనే విడుదల చేసే విధంగా పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఈ మూవీలో నటిస్తూనే సిద్దూ నీరజ కోన ని దర్శకురాలుగా పరిచయం చేస్తూ ‘తెలుసు కదా’ అన్న డిఫరెంట్ సబ్జెక్ట్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత క్రేజీ మూవీ ప్రాజెక్ట్ గా పేరు గాంచిన ‘టిల్లు క్యూబ్’ కు ఈ హీరో రెడీ అవుతాడని తెలుస్తోంది. ఈ సీక్వెల్ కు కూడ సిద్దూ దర్శకుడుని మారుస్తున్నాడని తెలుస్తోంది.

‘మ్యాడ్’ మూవీతో తన సత్తాని చాటుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ‘టిల్లు క్యూబ్’ సీక్వెల్ ఉంటుంది అని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు సిద్దూ ఆద్వర్యంలో జరుగుతున్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సిద్దూ ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన ఒక కథకు పెద్దగా ఆశక్తి కనపరచలేదు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి.

నందినీ రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ మూవీ తీస్తున్న సమయంలో ఆమె సిద్దూ జొన్నల గడ్డకు ఒక కథ చెప్పిందనీ అయితే ఆమె దర్శకత్వం వహించిన ఆ మూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు వార్తలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె అదే కథకు కొన్ని మార్పులు చేసి తేజ్ సజ్జా తో ఆ మూవీని ప్రారంభిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: