రాహుల్‌ చెప్పిన ఆ ఒక్క మాటతో మోదీలో భయం మొదలైందా?

Chakravarthi Kalyan
కాంగ్రెస్‌ కులగణన చేస్తామని చెప్పడంతో బీజేపీని ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతురావు ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న భయంతోనే మోదీ ఏడాదికి ఒక ప్రధాని మారతారని ఆరోపిస్తున్నట్లు వి. హనుమంతురావు ధ్వవజమెత్తారు. ఇండియా కూటమికి త్రిబుల్‌ ఫిగర్‌ రాదని అంటున్న మోదీ ఏడాదికి ఒకరు పీఎం అవుతారని ఎలా అంటారని వి. హనుమంతురావు ప్రశ్నించారు.

గడిచిన పదేండ్లలో మోదీ అయోధ్య కట్టడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని వి. హనుమంతురావు విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లను తీసేస్తామని బీజేపీ అంటోందని వి. హనుమంతురావు ఆరోపించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని వి. హనుమంతురావు అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి న్యాయం జరుగుతుందని వి. హనుమంతురావు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: