ధోనీకి ఇదేం కొత్త కాదు.. నాకోసం కోట్లు వదులుకున్నాడు : కోహ్లీ
ధోని అంటే కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు ధోని అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అన్న విధంగా ప్రస్తానాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇక ప్రస్తుతం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ ఇక అతని బ్రాండ్ వాల్యూ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం ఏదైనా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అంటే చాలు ఇక కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కంపెనీలు ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి ధోని కొన్ని కొన్ని సార్లు ఏకంగా కోట్ల రూపాయలను వదులుకునేందుకు కూడా సిద్ధపడుతూ ఉంటాడు అని చెప్పాలి.
ఇదే విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నెట్ ప్రాక్టీస్ లో ఇటీవల ధోని తన స్నేహితుని షాపు యొక్క స్టిక్కర్ను అతికించుకొని ఇక బ్యాటింగ్ చేయడం కనిపించింది. దీంతో ధోనీ పై ప్రశంసలు కురుస్తున్నాయ్. అయితే మహేంద్రుడుకి ఇది కొత్తేమీ కాదని BAS బ్యాట్ల తయారీ కంపెనీదారు సోమీ కోహ్లీ వెల్లడించారు. 2019 వరల్డ్ కప్ లో నాకోసం ధోని కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును వదులుకొని.. నా కంపెనీ బ్యాట్ వాడారు. రూపాయి కూడా అడగలేదు అంటూ సోమీ కోహ్లీ చెప్పుకొచ్చారు. 1998లో ధోని కెరియర్ ప్రారంభంలో సోమీ కోహ్లీ అటు ధోని కి హెల్ప్ చేశారట. ఇక అందుకు కృతజ్ఞతగా ధోని ఏకంగా BAS కంపెనీ బ్యాట్ ను ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాడేసారట. ఇదే బ్యాటుతో గతంలో పాకిస్తాన్ పై 148 పరుగులు చేసి సెంచరీ తో అదరగొట్టాడు.