వావ్.. కెప్టెన్ గా కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్?
అయితే ఇలా కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి. కానీ ఆ తర్వాత కాలంలో ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమే అన్న విషయం జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది. అది సరేగాని ఇప్పుడు కోహ్లీ, రోహిత్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జరిగిన మూడో టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసిన సమయంలో ఓపెనర్ గా బలిలోకి దిగిన రోహిత్.. చివరి వరకు బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ సాధించిన సెంచరీతో ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు అని చెప్పాలి.
భారత కెప్టెన్గా t20 ఫార్మాట్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇక టీమిండియా కెప్టెన్ గా టి20 ఫార్మాట్లో 1570 పరుగులు సాధించాడు. ఇటీవల సాధించిన సెంచరీ తో రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. భారత కెప్టెన్ గా టి20 ఫార్మాట్ లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా అవతరించాడు. ఇటీవల సాధించిన సెంచరీ తో రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో కెప్టెన్ గా 1572 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ 1570 పరుగుల రికార్డును బద్దలు కొట్టేసాడు అని చెప్పాలి.