కోహ్లీ డకౌట్.. అయినా ఫ్యాన్స్ హ్యాపీ?

praveen
గత కొన్ని రోజుల నుంచి టీమిండియా ప్రదర్శన చూస్తూ ఉంటే ఎప్పుడు ఏ ఆటగాడు మంచి ప్రదర్శన చేస్తాడు అన్నది ముందుగా ఊహించడం కష్టతరంగానే మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాగా ఆడతాడు అనుకున్న ఆటగాడు చెత్త ప్రదర్శనతో నిరాశపరిస్తే ఎలాంటి అంచనాలు లేని ప్లేయర్లు మాత్రం మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అయితే ఆఫ్గనిస్తాన్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై భారత జట్టు ఆఫ్గనిస్తాన్ తో ఆడిన టి20 సిరీస్ ను క్లీన్ స్లీప్ చేసింది. వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధిస్తూ అదరగొట్టింది. ఇక ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ అయితే ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది.

 నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఉత్కంఠ భరితమైన పోరులో రెండు సార్లు సూపర్ ఓవర్ నిర్వహిస్తే కానీ ఫలితం ఏంటి అన్న విషయం తేలలేదు. చివరికి ఈ ఉత్కంఠ పోరులో భారత జట్టు విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే ఇక ఈ టి20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లలో అటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో పరవాలేదు అనిపించాడు. అయితే మూడో టి20 మ్యాచ్ లో మాత్రం డక్ అవుట్ గా వెనుతిరిగాడు అని చెప్పాలి. దీంతో ఇక వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ ఆదుకుంటాడు అనుకుంటే.. చివరికి డకౌట్ కావడంతో అభిమానులు అందరూ కూడా నిరాశ చెందారు. అయితే బ్యాటింగ్లో విఫలమై నిరాశపరిచినప్పటికీ.. అటు విరాట్ కోహ్లీ మాత్రం ఫీల్డింగ్లో అదరగొట్టేసాడు.

 అయితే తన టి20 కెరీర్ లోనే తొలి గోల్డెన్ డకౌట్ నమోదు చేసుకున్నాడు కోహ్లీ. అది కూడా విరాట్ కోహ్లీకి సొంత గడ్డ లాంటి చిన్న స్వామీ స్టేడియంలో ఇలాంటిది జరగడం అభిమానులను మరింత నిరాశపరిచింది. అయితే ఇక బ్యాటింగ్ లో నిరాశ పరిచిన ఈ మ్యాచ్లో కింగ్ మెరుపు ఫీల్డింగ్  తో ఆకట్టుకున్నాడు  16వ ఓవర్లో జణత్ కొట్టిన బంతిని బౌండరీ వెళ్లకుండా గాల్లోకి ఎగిరి మరి ఆపిన విధానం.. ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసింది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్క మ్యాచ్ లో డక్ అవుట్ అయితే ఏంటి కోహ్లీ ఎప్పటికీ కింగే అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: