ఎక్కడ హేళన చేశారో.. అక్కడే ఫిదా చేసిన రోహిత్?

praveen
ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మట్లలో కూడా సారథిగా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి కూడా ఒక విషయంపై అతను తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ అంటే విరాట్ కోహ్లీలా ఫిట్ గా ఉండాలని రోహిత్ శర్మ మాత్రం ఫిట్నెస్ విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోడు అంటూ అందరూ విమర్శలు చేశారు. మరి ముఖ్యంగా రోహిత్ లాంటి ప్లేయర్ అటు టీ20లకు అస్సలు సరిపోడు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉన్నాడు రోహిత్ శర్మ.

 రోహిత్ శర్మ బ్యాటింగ్లో విఫలమైనప్పుడల్లా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి యువ ఆటగాడినికి సారధ్య బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని అభిప్రాయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా ఇక తనదైన కెప్టెన్సీ తో ఆట తీరుతో ముందుకు సాగుతూనే ఉన్నాడు రోహిత్ శర్మ. అయితే తన ఫిట్నెస్ గురించి విమర్శలు చేసే వారందరి నోల్లు మూయించే విధంగా ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో అన్ని తానై ఆడేసాడు అని చెప్పాలి.

 ఎందుకంటే ఆఫ్గనిస్తాన్తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. అయితే ఓపెనర్ గా బరిలోకి దిగి 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. ఇక ఆ తర్వాత 19 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు రోహిత్. ఇక రెండు సూపర్ ఓవర్లలో బ్యాటింగ్ ఫీల్డింగ్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇంకా ఇందుకు అదనంగా కెప్టెన్సీ వ్యూహాలను అమలు చేసే ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలా టి20లకు పనికిరాడు. ఫిట్నెస్ లేదు అన్న వాళ్లకి ఇక తన ఆటతో నోర్లు ముగించాడు అని చెప్పాలి. ఏ చిన్న స్వామి స్టేడియంలో అయితే ఒకప్పుడు రోహిత్ ను హేళన చేశారో.. ఇక ఇప్పుడు అదే చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: