ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు.. ఇండియా నుంచి ఒక్కరూ లేరుగా?
అదే సమయంలో ఇక డిసెంబర్ నెలలకు గాను ఇక అత్యంత ప్రదర్శన చేసిన ప్లేయర్లను ఎంపిక చేసి క్లియర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించడానికి సిద్ధమైంది ఐసీసీ. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో ఎవరు మంచి ప్రదర్శన చేశారు అని తెలుసుకోవడానికి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల డిసెంబర్ నెలకు కాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో ఉన్న ముగ్గురు ఆటగాళ్ల వివరాలను ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
అయితే ఐసీసీ ప్రకటించిన ఈ లిస్టులో అటు భారత జట్టు నుంచి ఒక్కరు కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో నిలవకపోవడం గమనార్హం. అయితే ఇక డిసెంబర్ నెలలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో నామినేట్ అయిన ఆటగాళ్ళ వివరాలు చూసుకుంటే.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ తో పాటు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లాం ఈ అవార్డు రేసులో నామినేట్ అయ్యారు అని చెప్పాలి. ఇక మహిళల విభాగంలో భారత క్రికెటర్లు జేమియా రోడ్రిక్స్ భారత బౌలర్ దీప్తి శర్మ, జింబాబ్వే ప్లేయర్ ప్రిసియస్ మారంగే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో ఉన్నారు.