వార్నీ.. ఈ ఇద్దరమ్మాయిలు చేసిన పనికి అందరూ షాక్?

praveen
ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులా సమ్మేళనం. ఒక్కసారి ప్రేమలో పడ్డారు అంటే చాలు ఇక ప్రేమికులు ఈ లోకాన్ని సైతం మరిచిపోయి ప్రేమలో మునిగితేలుతూ ఉంటారు అని ఇలా ప్రేమలో పడ్డవారే చెబుతూ ఉంటారు. అయితే ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతో మంది ఇక ఎవ్వరిని ఎదిరించడానికి అయినా కూడా సిద్ధపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఏదైనా చేసి ప్రేమను గెలిపించుకోవాలని ఆశపడుతూ ఉంటారు.

 ఇటీవల కాలంలో చూస్తుంటే ఎక్కువగా ప్రేమ వివాహాలే జరుగుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని కొన్ని విచిత్రమైన లవ్ స్టోరీలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా ఒక యువతి యువకుడి మధ్య ప్రేమ పుట్టడం సహజం. అయితే ఇది ప్రకృతి ధర్మం కూడా. కానీ ఇటీవల కాలంలో ఏకంగా ఇద్దరు యువకులు మధ్య లేదంటే ఇద్దరు యువతుల మధ్య కూడా ప్రేమ పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సభ్య సమాజం ఏమనుకున్న పర్వాలేదు మేమిద్దరం ప్రేమలో మునిగితేలుతూ సంతోషంగా ఉన్నామా లేదా అని అబ్బాయిలు,అమ్మాయిలు అనుకుంటున్నారు. దీంతో  అమ్మాయి మరో అమ్మాయిని అబ్బాయి మరో అబ్బాయిని ప్రేమించేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తోంది.

 అయితే ఇటీవల యూపీలోని డియోరియాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. అంతేకాదు సాంప్రదాయబద్ధంగా వివాహం కూడా చేసుకున్నారు. బెంగాల్కు చెందిన జయశ్రీ రౌల్ అనే 28 ఏళ్ల యువతి రాఖీదాస్ అనే 23 ఏళ్ల యువతి డియోరియాలోని ఆర్కెస్ట్రా గ్రూపులో పనిచేస్తున్నారు. అయితే వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. రెండేళ్లుగా వీరిద్దరూ కూడా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిపై నోటరీ కూడా సిద్ధం చేయించుకున్నారు. ఈ పెళ్లి కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: