తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ లు అక్కడే?

praveen
ఈ ఏడాది జూన్ నుండి ప్రారంభం కాబోయే 2024 t20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అటు వరుసగా ద్వైపాక్షక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది టీమ్ ఇండియా. ఇటీవల  సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో మూడు ఫార్మట్ లలో కూడా సీరిస్ లు ఆడింది. టి20 ఫార్మాట్ ను 1-1 తో సమం చేసిన టీమిండియా.. ఇక వన్డే ఫార్మాట్ ను 2-1 తో సొంతం చేసుకుంది. ఇక టెస్ట్ ఫార్మాట్ ను 1-1 సమం చేసి కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది అని చెప్పాలి.

 అయితే ఇలా సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకున్న టీమిండియా ఇక ఇప్పుడు స్వదేశంలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోతుంది అని చెప్పాలి. ఈనెల 11వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగబోతుంది. ఏకంగా 11, 14, 17వ తేదీలలో ఈ మూడు మ్యాచ్లు జరగబోతున్నాయ్ అని చెప్పాలి. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత అటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ప్రారంభించబోతుంది టీమిండియా. ఈనెల 25వ తేదీ నుంచి కూడా ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఏకంగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి.

 అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇక భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది.  ఎందుకంటే ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇక రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగబోతుంది. దీంతో ఇక తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఏకంగా ఇక ఈ మ్యాచ్లను చూసేందుకు రెడీ అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: