రెండు టెస్ట్ కి ముందు.. టీమిండియాకు మరో బిగ్ షాక్?
మరోవైపు వరల్డ్ కప్ సమయం లో గాయపడిన హార్థిక్ పాండ్యా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక ఇంకోవైపు ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం కావడంతో అతని స్థానంలో మరొకరిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా టీమిండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘోర పరాభవాన్ని చవి చూసింది. కానీ రెండో టెస్టులొ మాత్రం అద్భుతంగా పుంజుకొని విజయం సాధించాలని భావిస్తుంది.
అయితే రెండో టెస్టుకు ముందు అటు భారత జట్టుకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. జట్టులో స్టార్ పెసర్గా కొనసాగుతున్న శార్దూల్ ఠాగూర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా శార్దూల్ భుజానికి గాయమైనట్లు సమాచారం. అయితే స్కానింగ్ తీసిన తర్వాత ఇక గాయం తీవ్రత ఎంత ఉంది అన్న విషయంపై క్లారిటీ రానుంది. కాగా తొలి టెస్ట్ మ్యాచ్ లొ శార్దూల్ ఠాగూర్ బౌలింగ్లో ఒక వికెట్ తీసి బ్యాటింగ్లో 26 పరుగులు చేశాడు.