మాజీ క్రికెటర్ ఝాలన్ గోస్వామికి.. అరుదైన గౌరవం?

praveen
ఎన్నో ఏళ్లపాటు భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన రికార్డులు సాధించిన సీనియర్ క్రికెటర్ జులాన్ గోస్వామి గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే రెండు దశాబ్దాల పాటు అటు భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించారు ఆమె. ఇక భారత మహిళలు జట్టు సాధించిన ఎన్నో అద్వితీయమైన విజయాలలో ఆమె కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.



 ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలకుండా దేశం కోసం వీరోచిత పోరాటం చేశారు ఆమె. ఇలా భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఆమె ఒక లెజెండరీ క్రికెటర్ గా మిగిలిపోయారు అని చెప్పాలి. ఇక ఆమె స్ఫూర్తితోనే ఎంతోమంది క్రికెట్ నే ప్యాషన్ గా ఎంచుకొని ప్రస్తుతం భారత మహిళా క్రికెట్లో రాణిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ కి సేవలు అందించిన భారత మాజీ క్రికెటర్ జులాన్ గోస్వామికి ఇటీవలే ఒక అరుదైన గౌరవం లభించింది. దీంతో ఈ విషయం గురించి తెలిసి అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు.



 ఎమ్సిసి వరల్డ్ క్రికెట్ కమిటీలో సభ్యురాలిగా ఎంపికైంది భారత మహిళా మాజీ క్రికెటర్ జులాన్ గోస్వామి. ఆమెతోపాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్, ఇంగ్లాండు మహిళా మాజీ కెప్టెన్ హీథర్ నైట్ కి కూడా ఈ కమిటీలో చోటు దక్కింది అని చెప్పాలి. కాగా MCC అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఇందులో మాజీ క్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లతో పాటు ఇక అంపైర్లు కూడా సభ్యులుగా ఉంటారు అని చెప్పాలి. ఈ స్వచ్ఛంద సంస్థలో సభ్యత్వం దక్కడాన్ని క్రికెటర్లు గౌరవంగా భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆ అరుదైన గౌరవం భారత మాజీ క్రికెటర్ జులాన్ గోస్వామికి దక్కింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: