మైదానంలో గొడవ.. హర్షల్ పటేల్ ఇలా చేయడం ఏం బాలేదు?
ఇక ఫుల్ ఫాంలో కొనసాగుతున్న బెంగళూరు జట్టు ఎంతో అలవోకగా టార్గెట్ ఛేధించగలుగుతుంది అని అనుకున్నారు. కానీ చివరికి 29 పరుగుల తేడాతో ఓటమి చవిచూసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఇక ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ బెంగుళూరు బౌలర్ హాస్టల్ పటేల్ మధ్య గొడవ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. మాటల యుద్ధంలో దాదాపు ఒకరిని ఒకరు కొట్టుకొని స్థాయి వరకు వెళ్లారు. హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో రెండు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టి 18 పరుగులు రాబట్టాడు రియాన్ పరాగ్.
ఈ క్రమంలోనే ఇక హర్షల్ పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఇక పరాగ్ కూడా కోపంగానే స్పందించాడు. ఒకరిపై ఒకరు దూసుకు వచ్చారు. ఇక మధ్యలో మిగతా ఆటగాళ్లు కలుగజేసుకోవటం తో వీరి వివాదం ముగిసింది. మ్యాచ్ లో ఎన్ని వివాదాలు జరిగినా కూడా మ్యాచ్ అనంతరం మాత్రం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆనవాయితీని తుంగలో తొక్కారు హర్షల్ పటేల్. పరాగ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ అతను కనీసం మొహం కూడా చూడలేదు. రియాన్ పరాగ్ తో చేతులు కలపడానికి ఇష్టపడని హర్షల్ పటేల్ వేరే ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.