సఫారీల ఎదురీత... విజయానికి చేరువలో ఇండియా...!
సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా మరియు మార్క్ జెన్సెన్ తలో 3 వికెట్లు తీసుకోగా, ఎంగిడి 2 వికెట్లు దక్కించుకున్నాడు. తద్వారా సౌత్ ఆఫ్రికా లక్ష్యం 305 పరుగులు అయింది. వెంటనే రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు నెమ్మదిగా ఆడుతూ 94 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ మాత్రం అర్థ సెంచరీ చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. చివరిదైన ఈ రోజు ఇండియా ఇంకో 6 వికెట్లు సాధిస్తే విజయం దక్కించుకుంటుంది.
అలా కాకుండా సౌత్ ఆఫ్రికా 211 పరుగులు చేస్తే విజయం వారిని వరిస్తుంది. కానీ విజయ అవకాశం మాత్రం ఇండియాకే ఎక్కువగా ఉంది. మంచి జోరు మీదున్న ఇండియా బౌలర్లను అడ్డుకుని విజయం సాధించడం లేదా రోజంతా వికెట్లు కాచుకుని డ్రాగా ముగించడం అంత సులభమైన విషయం కాదు. టీమ్ లో సీనియర్లుగా ఉన్న డీకాక్ మరియు బావుమాలు ఇద్దరూ విలువైన ఇన్నింగ్స్ ఆడితే తప్ప ఓటమిని తప్పించుకోవడం అసాధ్యం. అయితే డ్రా కోసం తన పోరాటం ఏ విధంగా ఉండనుంది అనేది తెలియాలంటే ఇంకో గంట వేచి చూడాల్సిందే.