"సత్యభామ" ఆంధ్ర... సీడెడ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రచారాలను కూడా చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ ని మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
 

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా యొక్క ఆంధ్ర మరియు సీడెడ్ దియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ యొక్క ఆంధ్ర మరియు సీడెడ్ హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క ఆంధ్ర మరియు సీడెడ్ థియేటర్ హక్కులను దక్కించుకున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీ ని ఈ రెండు ప్రాంతాలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సత్యభామ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో తెలియాలి అంటే జూన్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: