ఊపిరి మూవీలో కార్తీ ప్లేస్ లో మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా కార్తీ కీలక పాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నాగార్జున , కార్తి , అనుష్క , తమన్నా లకు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు దక్కగా ... ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి కి కూడా ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో కార్తీ పాత్ర స్థానంలో మొదట వంశీ పైడిపల్లి వేరే హీరోను అనుకున్నారట. ఆ హీరో ను సంప్రదించారట , మొత్తం కథ నీ కూడా వివరించాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాలో నటించలేను అని చెప్పడంతో ఈ మూవీ లో కార్తీ ని తీసుకున్నారట. ఆ హీరో ఎవరు ..? అసలు ఆ కథ ఏంటి తెలుసుకుందాం. ఊపిరి మూవీ కి సంబంధించిన పనులు అన్ని ముగిసిన తర్వాత వంశీ ఈ సినిమా కథను నాగార్జున కు వినిపించారు. ఆయనకు అద్భుతంగా ఆ సినిమా కథ నచ్చింది.

ఆ తర్వాత కార్తి పాత్ర కోసం వంశీ , జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఆయనకు కథను వివరించారట , ఆయనకు కూడా ఆ కథ సూపర్ గా నచ్చినప్పటికీ ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో నేను ఈ సినిమా చేయలేను అని చెప్పారట. దానితో ఆయన కార్తీ సంప్రదించి ఈ మూవీ కథ చెప్పడం , ఆయనకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా ఓకే అయింది. అలా ఎన్టీఆర్ తో అనుకున్న పాత్రను కార్తీ తో తీసి వంశీ పైడిపల్లి బ్లాక్ బాస్టర్ మూవీ ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: