భారత పర్యటనలో భాగంగా ప్రస్తుతం వెస్టిండీస్ , ఆతిథ్య జట్టు తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో తలపడుతుంది. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో భారత్ విజయం సాధించగా రెండో మ్యాచ్ లో విండీస్ విజయం సాధించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే లో జరుగనుంది. కాగా ఇరు జట్లు ఈమ్యాచ్ ను గెలిచి ఎలాగైనా సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వున్నాయి.
ఇక ఈమ్యాచ్ లో వెస్టిండీస్ మార్పులు లేకుండా బరిలోకి దిగనుండగా భారత్ మాత్రం రెండో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా బౌలింగ్ మాత్రం నిరాశపరుస్తుంది. గత రెండు మ్యాచుల్లో బౌలర్ల ప్రదర్శన దారుణంగా వుంది. మొదటి మ్యాచ్ లో 200కుపైగా రన్స్ ఇవ్వగా రెండో మ్యాచ్ లో కూడా వికెట్లు తీయకుండా ప్రత్యర్థికి సునాయాసంగా విజయాన్ని కట్టబెట్టారు. దాంతో దీపక్ చాహర్ స్థానం లో షమీ ని అలాగే రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ లను తుది జట్టులోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది.