జనసేనా: రోజు రోజుకి దిగజారి పోతున్నారు కదయ్యా..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల రసవత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజవర్గంలో మరింత తీవ్రంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్నో కుటుంబాలు సైతం ప్రచారం చేస్తూ ఉన్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా నిర్మాతలు కూడా ప్రచారాలు మొదలుపెట్టారు. నిన్నటి రోజున వరుణ్ తేజ్ కూడా ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే వైసిపి తాజాగా జనసేన పైన పలు రకాల విమర్శలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే పవన్ పిఠాపురంలో ఓడిపోతారని భయంతో టిడిపి నేత వర్మని నమ్మలేక అతనిని వదులుకోలేక పాట్లు పడుతున్నారని విమర్శిస్తున్నారు. దూసుకుపోతున్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతోందని పవన్ ఓటమి భయం పట్టుకుంది అంటూ అందుకే పిఠాపురంలో గీతా అనే పేరు ఉన్న మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపణలు కూడా వినిపించాయి. పవన్ కళ్యాణ్ గీతా నామినేషన్ ఇద్దరి నామినేషన్లను ఒకే లాయర్ ఫీల్ చేయడంతో ఈ కుట్ర బయటపడింది అంటూ సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్తలు, నేతలు  పోస్ట్ చేశారు.

అఫిడవిట్లో అందుకు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ రెండు అఫీడవిట్లను వెంకటరమణారావు తయారు చేసినట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విషయం పైన ఫైర్ అవుతున్నారు. అమలాపురం పీకే ఫ్యాన్స్ అని ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టుగా వంగా గీత పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అలాగే వంగా గీత జనసేన పార్టీ నుంచే పోటీ చేయబోతున్నారనే విధంగా రాసుకున్నారని.. షేర్ చేయడంతో ఈ విషయం పైన పలువురు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఓటమి భయం పట్టుకోవడంతో ఇలాంటి జిమ్మిక్కులు పడుతున్నారు..రాబోయే రోజుల్లో మరింత దిగజారి పోయేలా కనిపిస్తున్నారు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: