నేపాల్ సంచలనం.. వెస్టిండీస్ ను మట్టికరిపించింది?

praveen
జెంటిల్మెన్ గేమ్ గా పిలుచుకునే క్రికెట్లో కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ మహా మహా టీమ్స్ ని సైతం మట్టి కనిపించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అయితే క్రికెట్లో పసికూన టీమ్స్ ఇలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకోవడం హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్నది చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి ఇదే జరిగింది.

సాధారణంగా వెస్టిండీస్ జట్టును అరవీర భయంకరమైన టీం గా పిలుచుకుంటూ ఉంటారు  ఎందుకంటే ఆ జట్టులోని హిట్టర్లు ఇక నిర్ధాక్షణంగా బౌలర్లపై విరుచుకుపడుతూ ఉంటారు అని చెప్పాలి. సిక్సర్లు ఫర్లతో చెలరేగిపోతూ పరుగులు పెట్టిస్తూ ఉంటారు. అందుకే వెస్టిండీస్ తో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక అగ్రశ్రేణి టీమ్స్ సైతం కాస్త ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వెస్టిండీస్ టీం ఇటీవలే ఒక పసికూన జట్టు చేతిలో ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు అటు నేపాల్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిథ్య నేపాల్ జట్టుతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతోంది. అయితే ఇటీవల జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో ఇక దారుణమైన ఓటమి చవిచూసింది వెస్టిండీస్  ఈ మ్యాచ్ లో పసికూన నేపాల్ సంచలనం సృష్టించింది. విండీస్ జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉండగా.. ఇక ఆ జట్టును ఓడించింది వెస్టిండీస్ - ఏ జట్టుతో నేపాల్ ఏ జట్టుకు ఇటీవల తొలి మ్యాచ్ జరగగా.. విండీస్ మొదట బ్యాటింగ్ చేసి 24 పరుగులు చేసింది. అయితే తర్వాత లక్ష్య చేదనలో నేపాల్ జట్టు మరో రెండు బంతులు  మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించి విజయాన్ని అందుకుంది. దీంతో నేపాల్ టీం సాధించిన ఈ అద్భుతమైన విక్టరీ గురించే అందరూ మాట్లాడుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: