ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..వైయస్ఆర్సిపి ఎమ్మెల్సీలుగా మోపిదేవి, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నిక...
అయితే మూడు నామినేషన్ లు మాత్రమే దాఖలయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ, ఒక ఒసీ, ఒక మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురికీ అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకట రమణ, అలాగే మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్, అలాగే మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురు వైయస్ఆర్ పార్టీ తరపునుండి నామినేషన్ లు వేయడం జరిగింది. తెలుగు దేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం లేదు. బలం లేనందున తెలుగు దేశం పార్టీ పోటీ నుండి కూడా తప్పుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను కూడా ఏకగ్రీవంగా దక్కించుకుంది.
కొద్ది సేపటి కిందట ఆ ఇద్దరూ ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్ధులు ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి మోపిదేవి వెంకట రమణ ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడుగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటినుంచి కూడా గతంలో వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి బీసీ నాయకుడు మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక్బాల్ మొన్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గం నుండి పోటీ చేశారు