చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జూ.ఎన్టీఆర్‌ మామ..?

Chakravarthi Kalyan
ఏంటో చంద్రబాబుకు అంతా బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది... వైసీపీలోకి పోలో మని పార్టీ నేతలు చాలా మంది క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా జగన్ చెంతకు చేరుతున్నారు. దీనికితోడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు జగన్ ను కలవడం హాట్ టాపిక్ అవుతోంది.



ఎన్.టి.ఆర్.మామ అయిన నార్నె శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా సమీప బంధువే. ఆయన ఈ సమయంలో జగన్ ను కలవడం సహజంగానే రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే తాను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నే శ్రీనివాసరావు అంటున్నారు.



టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరిన సమయంలోనే నార్నె కూడా లోటస్ పాండ్ కు వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాసరావు కుమార్తెతో పెళ్లి సంబంధం కుదర్చడంలోచంద్రబాబు కీలకపాత్ర పోషించాడని చెబుతారు. అయితే ఆ తర్వాత నార్నే శ్రీనివాసరావుతో చంద్రబాబు సంబంధాలు అంత సజావుగా ఉన్నట్టు కనిపించవు.



నార్నే శ్రీనివాసరావు గతంలో స్టూడియో ఎన్ అనే ఛానల్ ను నడిపించారు. ఎన్టీఆర్ పెళ్లయిన కొత్తలో దాన్ని కొంత కాలం చంద్రబాబు టీమ్ కు అప్పగించారు కూడా. కానీ ఆ తర్వాత కాలంలో చంద్రబాబు టీమ్ ఆ ఛానల్ నుంచి వైదొలిగింది. ఆ తర్వాత దాన్ని నార్నే అమ్మేశారని చెబుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: