షాకింగ్‌: జగన్‌కు కులపిచ్చి ఎక్కువా..?

Chakravarthi Kalyan

వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌కు కులపిచ్చి ఎక్కువా.. సహజంగా ఇలాంటి మాటలు వింటే.. ఈ డైలాగ్ అన్నది వేరే ఇతర సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారు.. వారికేదో కులాల పరంగా అన్యాయం జరిగి ఉంటే.. ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఈ విమర్శ చేసింది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విశేషం.



ఇంతకీ ఈ కామెంట్ చేసిందెవరనుకుంటున్నారా.. ఇంకెవరు.. ఇలాంటి కాంట్రవర్సీలకు పెట్టింది పేరైన జేసీ దివాకర్ రెడ్డి. జగన్‌కు ఓ తిక్కవాడని.. జగన్‌ కు కులపిచ్చి ఎక్కువనీ ఆయన విమర్శించారు. అనంతపురంలో టీడీపీ ధర్మ పోరాట సభ నిర్వహించింది. ఆ వేదికపై జేసీ ఈ విమర్శలు గుప్పించారు.



జగన్ కేవలం కుల బలంతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఐతే.. జగన్ ఆశ ఎప్పటికీ నెరవేరదని ఆయన తేల్చి చెప్పేశారు. జగన్‌ వంటి కుల పిచ్చి ఉన్న నాయకుల కుట్రలను చేధించడంలో చంద్రబాబు చేయి తిరిగిన మొనగాడని చెప్పుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి.



ఐతే.. జగన్ సామాజిక వర్గం గురించి కానీ.. ఆయన పార్టీలో ఆ సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత గురించి కానీ ఇది కొత్త విషయం ఏమీ కాదు.. అందులోనూ ఆ సామాజిక వర్గాన్ని నమ్ముకుని అధికారంలోకి రావడం కూడా అంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే ఆ కులానికి ఉన్న ఓట్ల సంఖ్య నామమాత్రమే. అనంతపురం సభలో వేదికపైనున్న చంద్రబాబును మెప్పించడానికి జేసీ దివాకర్ రెడ్డి గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: